PM Modi | వాషింగ్టన్, జూన్ 23: అమెరికాలో పర్యటనలో ప్రధాని మోదీకి స్థానిక మీడియా నుంచి భారత్లో మైనారిటీల హక్కులపై ప్రశ్నలు ఎదురయ్యాయి. బైడెన్తో ద్వైపాక్షిక చర్చల అనంతరం గురువారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ‘మైనారిటీల హక్కులను మెరుగుపరిచేందుకు భార త్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటున్నది?
అని ఓ జర్నలిస్టు మోదీని ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. ‘మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నప్పుడు, వివక్ష అనే ప్రశ్న ఉండదు’ అని పేర్కొన్నారు. మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు.