Indian Students | షికాగో, ఆగస్టు 17: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన 21 మంది భారత విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. వీసా తనిఖీలు పూర్తయినా.. సరైన పత్రాలు లేవనే కారణంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని స్వదేశానికి తిప్పి పంపారు. ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే జైలుకు పంపిస్తామని విద్యార్థులను హెచ్చరించారు.
ఈ విషయం తమను షాక్కు గురి చేసిందని తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులు పేర్కొన్నారు. అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగోలోని విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో భారత్కు పంపించారని తెలిపారు.