బోర్నియో: మలేషియాలో డజన్ల సంఖ్యలో ఉన్న ఒరంగుటాన్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆ జీవాలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఒరంగుటాన్ల ముక్కుల నుంచి స్వాబ్లను తీసుకున్నారు. బోర్నియో దీవిలో ఉన్న సాబా రాష్ట్రంలో ఉన్న సుమారు 30 ఒరంగుటాన్లకు కరోనా పరీక్షలు చేపట్టారు. మంగళవారం నిర్వహించిన ఆ పరీక్షల్లో అన్ని జీవాలకు నెగటివ్ వచ్చినట్లు వన్యప్రాణి అధికారులు చెప్పారు. దక్షిణాసియా దేశంలో ఒరంగుటాన్లకు కరోనా పరీక్షలు చేయడం ఇదే తొలిసారి. వైల్డ్ పార్క్, రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న సిబ్బందికి వైరస్ సోకిన నేపథ్యంలో ఒరంగుటాన్లకు కూడా పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి వేళ కోవిడ్ పరీక్షలు అత్యవసరమని, ఒరంగుటాన్ జనాభా కూడా ఇదే ముఖ్యమే అని సాబా వైల్డ్లైఫ్ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ తెలిపారు.