న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతంగా మీడియా కంపెనీని, సోషల్ మీడియా యాప్ను ఆవిష్కరించబోతున్నట్టు ప్రకటించారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలకు గట్టి పోటీ ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మీడియా కంపెనీకి ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’, సోషల్ మీడియా వేదికకు ‘ట్రూత్ సోషల్’ యాప్ పేర్లను ఖరారు చేసినట్టు చెప్పారు. క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థలు ట్రంప్ను బహిష్కరించాయి.