వాషింగ్టన్: భారత సంతతి జర్నలిస్టు కుశ్ దేశాయ్(Kush Desai)ని వైట్హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో కుశ్ దేశాయ్.. 2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్, ఐయోవా రిపబ్లికన్ పార్టీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా చేశారు. పెన్సిల్వేనియాకు కూడా డిప్యూటీ డైరెక్టర్గా చేశారు. అమెరికాలోని కీలకమైన రాష్ట్రాల్లో ప్రెస్ కార్యదర్శిగా కుశ్ దేశాయ్ వ్యవహరించినట్లు వైట్హౌజ్ తన ప్రకటనలో పేర్కొన్నది. బ్యాటిల్ గ్రౌండ్ లేదా స్వింగ్ స్టేట్స్ అన్నింటిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏడు కీలకమైన రాష్ట్రాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు. డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుశ్ దేశాయ్ను నియమిస్తున్నట్లు శుక్రవారం వైట్హౌజ్ ప్రకటించింది.
I’m back, back in the DC groove pic.twitter.com/MI7d8MeXep
— Kush Desai (@K_SDesai) January 25, 2025