కాఠ్మండు, మార్చి 11: ఓ వ్యక్తి కడుపులో నుంచి వోడ్కా బాటిల్ను నేపాల్ డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. కొద్ది రోజుల కిందట నుర్సద్, అతడి స్నేహితులు మద్యం తాగారు. అనంతరం కొందరు వోడ్కా బాటిల్ను పురీషనాళం ద్వారా నుర్సద్ శరీరంలోకి ఎక్కించారు. దీంతో భరించలేని నొప్పి రావడంతో నుర్సద్ దవాఖానలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి వోడ్కా బాటిల్ను తొలగించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నది.