ప్యాంగాంగ్: ఉత్తర కొరియా మాజీ అధినేత కిమ్ జోంగ్ ఇల్ పదో వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు, ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం నుంచి 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విధించిన ఆంక్షలు నివ్వెరపరుస్తున్నాయి. ఈ 11 రోజుల పాటు ఆ దేశంలోని ప్రజలెవ్వరూ నవ్వకూడదట! అదేవిధంగా షాపింగ్ చేయడం, మద్యం తాగడం వంటి వాటిపై కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా అంక్షలు ఉల్లంఘిస్తే ప్రతి ఏడాది మాదిరిగానే అరెస్టులు చేస్తామని హెచ్చరించింది. ‘ఆఖరుకు కుటుంబసభ్యుడెవరైనా మరణించినా.. పెద్దగా ఏడ్చేందుకు అనుమతి లేదు. పుట్టిన రోజుల వేడుకులపై నిషేధం’ అని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నది. 1994 నుంచి 2011 వరకు జిమ్ జోంగ్ ఇల్ ఉత్తరకొరియా అధినేతగా ఉన్నారు. 2011, డిసెంబర్ 17న గుండెపోటుతో మరణించాడు.