మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో ఓ రెస్టారెంట్కు వెళ్లిన వ్యక్తి వెయిట్రెస్కు ఏకంగా రూ. 4,00,000 టిప్ ఇవ్వడంతో (Trending News) ఆమె ఆశ్చర్యంతో కన్నీళ్లు రాల్చింది. మెల్బోర్న్లోని సౌత్ యరా ప్రాంతంలోని గిల్సన్ రెస్టారెంట్లో పనిచేసే లౌరెన్ ఒక్కరోజులో తన కెరీర్లోనే ఇంత పెద్ద మొత్తం అందుకుంది.
నలుగురు వ్యక్తులు ఆ టేబుల్పై పెద్ద మొత్తంలో బిల్ చేయగా వారిలో ఒకరు వెయిట్రెస్కు ఊహించని రేంజ్లో టిప్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. రసీదు వైపు చూసిన వెంటనే యూనివర్సిటీ విద్యార్ధిని కూడా అయిన వెయిట్రెస్ తన కండ్లను నమ్మలేదు. అయితే ఇది పొరపాటు కాదని వారు చెప్పడంతో ఆమె తన సహోద్యోగుల వద్దకు పరుగున వెళ్లి ఉద్వేగంతో కంటనీరు పెట్టుకుంది.
రెస్టారెంట్ పాలసీ ప్రకారం వెయిటర్స్ అందరూ టిప్స్ను తమ మధ్య పంచుకోవాలి. అయితే ఉదారంగా టిప్ ఇచ్చిన కస్టమర్ టిప్లో అధిక భాగం లౌరెన్కు చెందాలని స్పష్టంగా చెప్పారు. టిప్లో 70 శాతం ఆమెకు దక్కాలని అతడు చెప్పడంతో లౌరెన్కు ఆ మొత్తం లభించింది. ఇక ఉదారంగా టిప్ ఇచ్చిన వ్యక్తిని మెల్బోర్న్కు చెందిన క్రిప్టో బిలియనీర్ ఎడ్ క్రెవెన్గా గుర్తించారు. ఆన్లైన్ క్యాసినో ఎంటర్ప్రైజ్ సహ వ్యవస్ధాపకుడు కూడా అయిన క్రెవెన్ ఆస్ట్రేలియాలో అత్యంత పిన్నవయస్కుడైన బిలియనీర్.