న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. ఒక్కో ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్న తాలిబాన్ ఉగ్రవాదులు.. ఆఫ్ఘాన్ సైన్యంతో హోరాహోరీగా పోరాడుతున్నారు. పలు ప్రావిన్స్లలో పైచేయి సాధించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గత ఐదు రోజుల్లో ఐదు ప్రావిన్స్లను హస్తగతం చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న తాలిబాన్ హింసను దృష్టిలో ఉంచుకుని అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది. ఈ విమానంలో 50 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు. ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఏ-షరీఫ్ నుంచి ప్రత్యేక విమానంలో వారిని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ ప్రావిన్స్ సరిహద్దు మధ్య ఆసియాతో కనెక్టై ఉన్నది. దాదాపు 1500 మంది భారతీయులు ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం అధికారులు చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్-భారతదేశాల మధ్య వాణిజ్య విమానాలు మూసివేసే ముందు స్వదేశానికి తిరిగి రావాలని కోరుతూ భారతీయులకు కాబూల్లోని భారత మిషన్ భద్రతా సలహా జారీ చేసింది.
మరోవైపు, భారతదేశం తన దౌత్యవేత్తలను మజార్-ఏ-షరీఫ్ లోని కాన్సులేట్ కార్యాలయం నుంచి తొలగించింది. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ నుంచి ఇప్పటికే తన దౌత్యవేత్తలను భారత్ తీసుకెళ్లారు. అయితే, కాబూల్లోని భారత రాయబార కార్యాలయం ఇంకా మూసివేయలేదు.
డయాబెటిస్ను ఇలా కూడా ముందే గుర్తించొచ్చు..!
ఇస్రో మరో మైలురాయి.. ఆకాశంలో మన ‘కన్ను’
చిన్నారిని చంపేసిన ఆన్లైన్ చదువు
చేతిలో భగవద్గీత.. నవ్వుతూ ఉరికంభంపైకి..
నీరజ్ చోప్రా ‘పసిడి’ రహస్యమిదే..?!
అంతరిక్షంలో వరుడు.. టెక్సాస్లో వధువు.. వీడియో కాల్లో పెండ్లి
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..