గత ఏడాది భారత్లో దాదాపు 42 లక్షల కరోనా మరణాలను టీకాలు నివారించాయని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. టీకా పంపిణీ మొదలైన తర్వాత 2020 డిసెంబర్ 8- 2021 డిసెంబర్ 8 మధ్య భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మరణాల నివారణపై బ్రిటన్కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ అధ్యయనం నిర్వహించింది.
టీకా పంపిణీ వల్ల ఆ వ్యవధిలో భారత్లో 42 లక్షల కరోనా మరణాలను నివారించగలిగినట్టు నివేదిక అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 2 కోట్ల మంది ప్రాణాలను టీకాలు నిలిపాయని తెలిపింది.