మాడ్రిడ్ : స్పెయిన్లో కరోనా మరణాలు 90 వేలకు చేరాయి. ఈ విషయాన్ని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. గత శుక్రవారం నుంచి సోమవారం వరకు 202 కరోనా మరణాలు సంభవించాయని తెలిపింది. కరోనా మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు 90,136 మంది మరణించినట్లు స్పష్టం చేసింది.
72 గంటల వ్యవధిలో కొత్తగా 2,92,394 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. స్పెయిన్లో ఇప్పటి వరకు 74,57,300 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 23.58 శాతం మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ లో చేరి చికిత్స పొందుతున్నారు. 13.4 శాతం మంది రోగులు సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక 5 నుంచి 16 ఏండ్ల వయసున్న 33,50,000 మందికి కరోనా టీకా వేసినట్లు తెలిపింది. కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు స్పానిష్ ప్రధాని పెడ్రో షాంచెజ్ స్థానిక మీడియాకు తెలిపారు. 3,44,000 డోసుల ఫైజర్ టీకాను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.