న్యూఢిల్లీ, జూలై 21: అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనంతరం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్… ఇద్దరు ప్రముఖులకు ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అవార్డును ప్రకటించారు. స్పెయిన్కు చెందిన సెలెబ్రిటీ చెఫ్ జోస్ ఆండ్రెస్, అమెరికాకు చెందిన రాజకీయ వ్యాఖ్యాత వ్యాన్ జోన్స్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇద్దరికీ చెరో 10 కోట్ల డాలర్లు (సుమారు రూ.745 కోట్లు) అందిస్తామని విలేకరుల సమావేశంలో బెజోస్ తెలిపారు. జోస్కు మానవతావాదిగా పేరున్నది. ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2010లో ఏర్పాటైన ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల బాధితులకు ఆహారం అందిస్తుంది. వ్యాన్ జోన్స్ టీవీ హోస్ట్గా, రచయితగా పేరు సంపాదించారు. సీఎన్ఎన్లో ‘వ్యాన్ జోన్స్ షో’ను నిర్వహిస్తున్నారు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రత్యేక సలహాదారుడిగా వ్యవహరించారు. పలు స్వచ్ఛంద సంస్థల ఏర్పాటుకు కృషి చేశారు.