వెడ్డింగ్ ఫోటోషూట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మధురానుభూతి. పెళ్లికి ముందు చాలామంది ఫోటోషూట్ తీసుకొని ఆ ఫోటోలను తర్వాత చూసుకొని మురిసిపోతుంటారు. ఈమధ్య వెడ్డింగ్ ఫోటోషూట్ అనేది కామన్ అయిపోయింది. ఇలాగే కజకిస్తాన్కు చెందిన ఓ జంట.. ఫోటోషూట్ చేస్తూ అడ్డంగా బుక్కయిపోయింది.
ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మిగుల్చుతుందనుకున్న ఫోటోషూట్.. చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఫోటోషూట్లో పాల్గొంటుండగా.. ఆ జంట పక్కనే ఉన్న బురద నీటి గుంటలో పడిపోయారు. దీంతో ఫోటోషూట్ కోసం వేసుకొచ్చిన డ్రెస్కు బురద అంటింది. దీంతో ఫోటోషూట్ను మధ్యలోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోవాల్సివచ్చింది.
వాళ్లు బురద గుంటలో పడిన తర్వాత కూడా ఆ ఫోటోగ్రాఫర్.. తన కెమెరాకు పనిచెప్పాడు. దీంతో వెడ్డింగ్ ఫోటోషూట్ కన్నా.. బురదలో పడ్డ తర్వాత తీసిన ఫోటోలు బాగా వచ్చాయి. ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.