ఇటీవలి కాలంలో చాలా దేశాల్లో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. తైవాన్లో కూడా ఇదే పరిస్థితి. అయితే రెండోసారి కరోనా కేసులు ఎలా మొదలయ్యాయనే అంశంపై ఇక్కడ పరిశోధనలు చేశారు. దీనిలో ఒక షాకింగ్ విషయం వెల్లడైంది. గడిచిన నెలరోజుల్లో నమోదైన తొలి కరోనా కేసు ఒక మహిళా సైంటిస్టుదేనని తేలింది.
ఆమె ఒక హైసెక్యూరిటీ ల్యాబ్లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ల్యాబొరేటరీలో కరోనా సోకిన ఎలుక ఆమెను రెండుసార్లు కరిచిందట. ఆ తర్వాతే ఆమెకు కరోనా సోకిందేమోనని కొందరు పరిశోధకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తైవాన్ ఆరోగ్యశాఖ మంత్రి చెన్ షి చుంగ్ వెల్లడించారు.
అయితే సదరు సైంటిస్టును ఎలుక కొరకడం వల్లే కరోనా సోకిందా? లేక మరేదైనా కారణముందా? అనే అంశంపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కరోనా సోకిన శాస్త్రవేత్త ఇటీవలి కాలంలో విదేశాలకైతే ప్రయాణించలేదని మాత్రం అధికారులు స్పష్టం చేశారు.