జెనీవా: ఈ ఏడాది కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 12 సెకండ్లకు ఒకరు చనిపోతున్నప్పటికీ ఇది సాధ్యం అవుతుందని వివరించింది. వ్యాక్సినేషన్ ముమ్మరం, కరోనా నిబంధనలు పాటించడంతోనే ఇది సాధ్యమని పేర్కొంది.