Indonasia : ఇండోనేషియాలోని ప్రైవేట్ కంపెనీకి చెందిన ఒక బొగ్గుగనిలో శుక్రవారం భారీ ఫేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయారు. నలుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. పశ్చిమ సుమత్రా రాష్ట్రంలోని సవహ్లుంటో జిల్లాలో ఉన్న బొగ్గుగనిలో విషవాయువుల కారణంగా పేలుడు జరిగినట్టు అధికారులు తెలిపారు. మీథేన్ వంటి ప్రాణాంతక వాయువుల వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో విషవాయువులను బయటకు పంపేందుకు బ్లోయర్స్, ఎక్స్టెన్షన్ ఫ్యాన్లు ఉపయోగించారు. ఈ ప్రమాదంలో నాలుగో వ్యక్తిని 240 మీటర్ల దూరంలో కనిపెట్టారు. ప్రాణాలతో బయటపడ్డ వాళ్లందరికీ కాలిన గాయాలు అయ్యాయి. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దాంతో వాళ్లకు రెస్క్యూ బృందాలు వెంటనే ఆక్సిజన్ అందించాయి. ఆ తర్వాత వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.