సింగపూర్: చైనాకు చెందిన ఓ వ్యక్తి సింగపూర్లో ఓ భారతీయ మహిళ(Indian Woman)పై దాడి చేశాడు. ఈ ఘటన 2021, మే 7వ తేదీన జరిగింది. ఆ కేసులో 32 ఏళ్ల వాంగ్ జింగ్ ఫాంగ్ అనే వ్యక్తికి సింగపూర్లో మూడు నెలల జైలుశిక్షను ఖరారు చేశారు. 57 ఏళ్ల భారతీయ మహిళ హిండోచ నీతా విష్ణుభాయ్ ఓ ఎస్టేట్ వద్ద అతను అటాక్ చేశాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ దాడి జరిగింది. భారతీయ మహిళకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని కూడా వాంగ్ను ఆదేశించారు. మత, జాతి విద్వేషంతో అటాక్ చేయడాన్ని ఖండిస్తున్నామని, ఇలాంటివి సింగపూర్లో కుదరవని జిల్లా జడ్జి సైఫుద్దిన్ సరువాన్ తన తీర్పులో పేర్కొన్నారు.