తైయిపి: తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాయుసేన, నావికాదళానికి చెందిన డ్రాగన్ సైన్యం డ్రిల్స్తో తైవాన్ను వణికిస్తోంది. అయితే ఆక్రమించాలన్న ఉద్దేశంతోనే చైనా ఆ సైనిక విన్యాసాలు చేపడుతున్నట్లు తైవాన్ విదేశాంగ మంత్రి అన్నారు. ఇటీవల అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నేపథ్యంలో తైవాన్పై చైనా తన సైనిక సత్తాను ప్రదర్శిస్తోంది. డ్రిల్స్తో, సైనిక చర్యలతో తైవాన్ను ఆక్రమించాలని చైనా చూస్తున్నట్లు మంత్రి జోసెఫ్ వూ తెలిపారు. మిలిటరీ విన్యాసాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, మిస్సైల్స్ను కూడా లాంచ్ చేస్తున్నారని, సైబర్ దాడులు కూడా జరుగుతున్నాయని, ప్రస్తుతం తైవాన్ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు ఆయన అన్నారు.