బీజింగ్: జననాల వృద్ధిరేటును పెంచేందుకు చైనా నడుం బిగించింది. కొత్త యుగం(న్యూ ఎరా) పేరిట పెళ్లిళ్లు, సంతానోత్పత్తి, జననాల వృద్ధి రేటును పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. ఇటీవల చైనాను దాటి భారత్ జనాభాలో ప్రథమ స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల పాటు చైనాలో వన్ చైల్డ్ పాలసీని అమలు చేయడంతో జననాల రేటు భారీగా పడిపోయింది. దీన్ని అధిగమించేందుకు దేశంలోని 20కి పైగా నగరాల్లో మొదట పైలట్ ప్రాజెక్టును నిర్వహించనున్నారు.