(China @ LAC) భారతదేశం సరిహద్దులో పొరుగు దేశం చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతున్నది. 17 నెలల క్రితం తూర్పు లడఖ్లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత.. మరోసారి మనతో తలపడేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నది. సరిహద్దు రేఖకు సమీపంలో తన సైన్యం కోసం చైనా బంకర్ను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తున్నది. సరిహద్దుల్లోని 8 ప్రాంతాల్లో క్యాంపులను సిద్ధం చేసుకుంటున్నది. ప్రతి ఒక్క ప్రాంతంలో దాదాపు 84 టెంట్లను వేసినట్లుగా ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తున్నది.
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, తూర్పు లడఖ్ ముందున్న వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) కు సమీపంలో దాదాపు 8 ప్రదేశాల్లో సైన్యం ఉండేందుకు వీలుగా కొత్త తాత్కాలిక గుడారాలు (మాడ్యులర్ కంటైనర్లు) చైనా ఏర్పాటు చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల కోసం వహబ్ జిల్గా నుంచి ఉత్తరాన కారాకోరం పాస్ దగ్గర పియూ, హాట్ స్ప్రింగ్స్, చాంగ్ లా, తాషిగాంగ్, మంజా, చురూప్ వరకు గుడారాలను నిర్మించింది. ప్రతి ప్రదేశంలో ఏడు క్లస్టర్లలో 80 నుంచి 84 కంటైనర్లు ఏర్పాటుచేస్తున్నారు.
గత ఏడాది ఏప్రిల్-మే నెలలో భారత్-చైనా మధ్య సైనిక ఘర్షణ జరిగినప్పటి నుంచి, చైనా అనేక శిబిరాలను ఏర్పాటు చేసింది. పాత శిబిరాలకు అదనంగా ఈ కొత్త శిబిరాలను నిర్మిస్తున్నారు. సరిహద్దు నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే ఉద్దేశం చైనాకు లేదని ఈ నిర్మాణాలు స్పష్టం చేస్తున్నాయి. తూర్పు లడఖ్ సమీపంలోని సరిహద్దు రేఖపై భారత్-చైనా 50 వేల మంది సైనికులను మోహరించాయి. వీరితోపాటు హోవిట్జర్లు, ట్యాంకులు, క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో.. చైనా అనేక ఎయిర్స్ట్రిప్లు, హెలిప్యాడ్లను కూడా నిర్మించింది. తన ప్రధాన ఎయిర్బేస్లైన హోటాన్, కాష్గర్, గర్గున్సా, లాసా-గోంగార్, షిగాట్సేలను కూడా చైనా అప్గ్రేడ్ చేసినట్లు సమాచారం.
ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఊపిరి
ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్..!
విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..