చైనాలో జీరో కొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనల కట్టడికి పోలీసులు పౌరులపై నిఘా పెట్టారు. నిరసనకారులను పట్టుకొనేందుకు సెల్ఫోన్ల లోకేషన్ డాటాను వినియోగించుకొంటున్నారు.
ఒకవేళ సెల్ఫోన్ల సిగ్నళ్లు ఇటీవల జరిగిన ఏదైనా ఆందోళన ప్రాంతానికి దగ్గరగా ఉన్నట్టు గుర్తిస్తే, పోలీసుల నుంచి నిరసనకారులకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సీఎన్ఎన్ నివేదించింది.