బీజింగ్: తైవాన్ సమీపంలో చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్లో టూర్ చేసిన అంశంపై సీరియస్గా ఉన్న డ్రాగన్ దేశం చైనా ఇవాళ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్లు తేలింది. ఈస్ట్రన్ థియేటర్ కమాండ్ సెంటర్కు చెందిన రాకెట్ ఫోర్స్ సాంప్రదాయ మిస్సైల్ పరీక్ష చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా కూడా ద్రువీకరించింది. టార్గెట్ను చాలా కచ్చితత్వంతో చేరుకున్నట్లు వెల్లడించారు.
పలు డాంగ్ఫెంగ్ బాలిస్టిక్ మిస్సైళ్లను తైవాన్ నార్త్ఈస్ట్లో జలాల్లో ప్రయోగించినట్లు చైనా పేర్కొన్నది. తైవాన్ రక్షణ శాఖ కూడా ఈ మిస్సైళ్ల పరీక్షను ద్రువీకరించింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డాంగ్ఫెంగ్ మిస్సైళ్లను ఆపరేట్ చేస్తుంది. ఆ క్షిపణులను ప్రయోగించిన సమయంలో తాము డిఫెన్స్ సిస్టమ్లను యాక్టివేట్ చేసినట్లు తైవాన్ రక్షణశాఖ చెప్పింది. చైనా అక్రమ చర్యలకు పాల్పడుతోందని, ప్రాంతీయ శాంతికి ఇబ్బంది కలగచేస్తోందని తైవాన్ ఆరోపించారు.