బీజింగ్: చైనా ప్రయోగించిన చాంగ్ ఈ-5 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై నీటి ఆనవాళ్లను గుర్తించింది. చంద్రుడిపై నీటిని ఉపగ్రహాలతో గతంలోనే గుర్తించినప్పటికీ అక్కడ ల్యాండ్ అయి పరిశోధన చేసి గుర్తించడం ఇదే తొలిసారి. టన్ను మట్టికి 120 గ్రాముల చొప్పున నీళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండర్లో ఉన్న ప్రత్యేక పరికరం సాయంతో ఈ పరిశోధనలు నిర్వహించారు.