చైనాపై నేపాల్ సంచలన ఆరోపణలు చేసింది. తమ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోందని నేపాల్ తన రిపోర్టులో పేర్కొంది. నేపాల్లోని హుమ్లా జిల్లాలోని భూభాగాన్ని చైనా ఆక్రమించిన తర్వాత నేపాల్ ఓ కమిషన్ను నియమించింది. ఈ రిపోర్టు ఆధారంగానే నేపాల్ పై వ్యాఖ్యలు చేసింది. నేపాల్లోని లలుంగ్జోంగ్ ప్రాంతంలో ధార్మిక కార్యక్రమాలపై చైనా ఆర్మీ ఆంక్షలు విధించిందని, పశువులు మేతమేయడాన్ని కూడా తగ్గించేలా చైనా ఆర్మీ చేస్తోందని నేపాల్ తన రిపోర్టులో ఆరోపించింది. తమ భూభాగం దగ్గర్లో ఓ కంచెను నిర్మించాలని కూడా చైనా ప్రయత్నాలు చేస్తోందని, రోడ్లను నిర్మించాలని కూడా చూస్తోందంటూ నేపాల్ విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో నేపాల్ సరిహద్దుల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని నేపాల్ నిర్ణయించుకుంది.
లీకైన రిపోర్టులు…
అయితే ఈ విషయంపై నేపాల్ అధికారిక వర్గాలు ఎలాంటి కామెంట్లూ చేయడం లేదు. వాస్తవానికి ఈ రిపోర్టు లీక్ అయ్యింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దగ్గర అలాగే ఉండిపోయింది. చైనా ఆక్రమణకు సంబంధించిన అన్ని ఆధారాలున్నా… నేపాల్ అధికారికంగా మాత్రం మాట్లాడటం లేదు.