జెంగ్జూ: హెనాన్ ప్రావిన్సులో జరిగిన గ్రామీణ బ్యాంకు కుంభకోణంలో సుమారు 234 మందిని అరెస్టు చేసినట్లు చైనా అధికారులు వెల్లడించారు. క్రిమినల్ గ్యాంగ్ నుంచి డబ్బుల్ని వసూల్ చేసినట్లు కూడా అధికారులు తెలిపారు. ఇటీవల పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వద్ద సుమారు వెయ్యి మంది డిపాజిటర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆ ప్రదర్శనతో అప్రమత్తమైన ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల్లో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టింది. హెనాన్ లోని బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ ఇటీవల తమ కస్టమర్లకు వార్నింగ్ ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఇన్వెస్ట్మెంట్ను విత్డ్రా చేసుకోరాదు అని ఆ బ్రాంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కస్టమర్లు గగ్గోలు పెట్టారు. అయితే లియూ యి నేతృత్వంలోని ఓ క్రిమినల్ గ్యాంగ్ సుమారు నాలుగు గ్రామీణ బ్యాంకులను నడుపుతోందని, ఆ గ్యాంగ్ తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేల్చారు. రూరల్ బ్యాంకులు ఆన్లైన్ సర్వీసులు నిలిపివేయడంతో కస్టమర్లు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విచారణ చేపట్టగా.. క్రిమినల్ గ్యాంగ్ ఆగడాలు బయటపడ్డాయి.