Caitlin Sandra Neil | వాషింగ్టన్ : చెన్నైలో జన్మించిన ఇండియన్ అమెరికన్ టీనేజర్ కెయిట్లిన్ శాండ్రా నెయిల్ (19) మిస్ ఇండియా యూఎస్ఏ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. తాను తన కమ్యూనిటీపై శాశ్వతమైన ముద్ర వేయాలనుకుంటున్నానని, మహిళా సాధికారత, అక్షరాస్యతలపై దృష్టి సారిస్తానని ఆమె చెప్పారు. వెబ్ డిజైనర్ను కావాలనుకుంటున్నానని, మోడలింగ్, యాక్టింగ్ కూడా చేస్తున్నానని తెలిపారు. మిస్ట్రెస్ ఇండియా యూఎస్ఏగా సంస్కృతి శర్మ (ఇల్లినాయిస్), మిస్ టీన్ ఇండియా యూఎస్ఏగా అర్షిత కట్పలియా (వాషింగ్టన్) ఎంపికయ్యారు.
మిస్ ఇండియా యూఎస్ఏ పోటీలో ఫస్ట్ రన్నరప్గా నిరాలి దేసియా, సెకండ్ రన్నరప్గా మానిని పటేల్ నిలిచారు. మిస్ట్రెస్ ఇండియా యూఎస్ఏ పోటీలో ఫస్ట్ రన్నరప్గా సప్నా మిశ్రా, సెకండ్ రన్నరప్గా చిన్మయీ ఆయాచిత్ నిలిచారు. టీన్ కేటగిరీలో ఫస్ట్ రన్నరప్గా ధ్రుతి పటేల్, సెకండ్ రన్నరప్గా సోనాలి శర్మ నిలిచారు. ఇండియా ఫెస్టివల్ కమిటీ న్యూజెర్సీలో నిర్వహించిన ఈ పోటీల్లో 25 రాష్ర్టాల నుంచి 47 మంది పాల్గొన్నారు.