Chandrayaan-3 | దక్షిణ కొరియాకు చెందిన లూనార్ ఆర్బిటర్ దనూరి ఇటీవల చంద్రుడి ఉపరితలంపై దిగిన చంద్రయాన్-3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని తీసింది. శివశక్తి పాయింట్లో ఉన్న ల్యాండర్ ఫొటోలు కనిపిస్తున్నది. చంద్రుడి ఉపరితలంపైనున్న విక్రమ్ ల్యాండర్ను లూనార్ ఆర్బిటర్ గుర్తించడం దక్షిణ కొరియా అంతరిక్ష కార్యక్రమానికో అతిపెద్ద విజయం. దక్షిణ కొరియా ఆర్బిటర్ మిషనర్ అక్టోబర్ 2022లో ప్రారంభమైంది. ఆర్బిటర్లో హైరిజల్యూషన్ కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇందులో చిన్న రోవర్ సైతం ఉన్నది.
రాబోయే రోజుల్లో చంద్రుడి ఉపరితలంపై దింపేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం లూనార్ ఆర్బిటర్ చంద్రుడి కక్ష్య తిరుగుతూ.. చంద్రుడి ఉపరితలంపై కన్నేసి ఉంచింది. ఈ ఆర్బిటర్ తన కెమెరాతో ల్యాండర్ విక్రమ్ను గుర్తించి.. ఆ చిత్రాలను తీసి పంపింది. దక్షిణ కొరియా సైతం చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్నది. ఆ దేశం 2030 నాటికి మానవుడిని చంద్రుడిపైకి పంపాలని యోచిస్తున్నది. ఇదిలా ఉండగా.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయంతంగా దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన నాలుగో దేశంగా నిలిచింది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనా ఈ ఘనతను సాధించాయి.