న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ నేతలతో భారత విదేశాంగమంత్రి జైశంకర్ సమావేశమయ్యారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిబన్ నేతలతో జైశంకర్ భేటీ అయ్యారని, భారత్తో తమ సంబంధాలకు పాక్ అభీష్టానికి ఎలాంటి సంబంధం ఉండబోదని ఆ నేతలు మంత్రికి హామీ ఇచ్చారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. అఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో భవిష్యత్లో ఆ దేశంలో తాలిబన్లు కీలకం కానున్న దృష్ట్యా భారత్ వారితో చర్చలు జరుపుతున్నదని ఖతార్ దౌత్యవేత్త ఒకరు ఇటీవల వ్యాఖ్యానించారు.