వాషింగ్టన్, జూన్ 9: వాహనాల నుంచి వచ్చే పొగతో వాయుకాలుష్యం తీవ్రమైపోతున్నది. బయటకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి ఎన్నో కాలుష్య కారకాలు మన శరీరంలోకి చేరిపోతున్నాయి. అయితే వాటిని మన శరీరం నుంచి పారదోలాలంటే క్యారెట్లు, సెలెరీ, కొత్తిమీర తింటే సరిపోతుందని చెబుతున్నారు పరిశోధకులు.
అమెరికాలోని డెలావర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం ద్వారా దీన్ని గుర్తించారు. సిగరెట్ పొగ, వాహనాల నుంచి వెలువడే పొగలో అక్రోలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులు, చర్మానికి నష్టం చేస్తుంది. ఎపియేషి కుటుంబానికి చెందిన క్యారెట్, సెలెరీ, ఆకుకూరల్లో కాలుష్య కారకాలను నాశనం చేసే పోషకాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.