రకరకాల వివాదాలు తన తలకు చుట్టుకోవడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల రాజానామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆ దేశ ప్రధాని ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు బ్రిటన్ ప్రధాని పదవి కోసం నాలుగో రౌండ్ ఓటింగ్ జరగనుంది.
ఈ రేసులో భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణ దంపతుల అల్లుడు రిషి సునాక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. బోరిస్ జాన్సన్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేసిన రిషి.. ప్రధానిపై అసంతృప్తితో కొంతకాలం క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బ్రిటన్ కొత్త ప్రధాని కోసం కన్జర్వేటివ్ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లో రిషి జైత్రయాత్ర కొనసాగించారు. మొదటి రెండు దశల్లో విజయం సాధించిన ఆయన.. మూడో దశలోనూ సత్తాచాటారు. మొత్తం 115 ఓట్లతో తన ప్రత్యర్థుల కన్నా ముందు వరుసలో నిలిచారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో నలుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు.