కాలిఫోర్నియా: మాటలు రాని వారు తమ మనసులోని మాటలను బయటపెట్టే సాంకేతికతను అమెరికాలోని స్టాన్ఫర్డ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఓ అరుదైన వ్యాధి కారణంగా 13 ఏండ్లుగా మాట్లాడని ఓ మహిళ బ్రెయిన్ చిప్ సాయంతో తన మనసులోని భావాలను వ్యక్తం చేసినట్టు వారు వెల్లడించారు.
నిమిషానికి సుమారు 62 పదాలను కంప్యూటర్ మానిటర్ ద్వారా ఆమె వ్యక్తపరిచారని పరిశోధకులు తెలిపారు. చిన్నపాటి సెన్సార్లను ఆమె మెదడులోకి ప్రవేశపెట్టి చేసిన క్లినికల్ ట్రయల్స్లో పురోగతి సాధించినట్టు పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఫిలిప్ సేబ్స్ తెలిపారు.