బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో ఓ రైలులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సబ్వే రైలు మిస్టిక్ నదిపై వెళ్తోంది. బ్రిడ్జ్పై రైలు ఆగిపోవడంతో అందులో జనం కిటికీల నుంచి బయటకు దూకారు. ఓ మహిళ తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఆమె ఏకంగా నదిలోకి దూకేసింది. మంటలు చెలరేగిన రైలు నుంచి సుమారు 200 మందిని సురక్షితంగా తరలించారు. రైలుకు ఉన్న మెటల్ ప్యానల్ పట్టాలకు తగలడం వల్ల మంటలు వ్యాపించాయి. దీంతో ఆరెంజ్ లైన్ ట్రైను సర్వీసును నిలిపివేసినట్లు మాసాచుటెస్ బే ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ తెలిపింది.
Boston train catches fire above the Mystic River this morning from CatastrophicFailure