లండన్: అల్జీమర్స్ను రోగ నిర్ధార ణకు మూడున్నరేండ్లు ముందేగుర్తించే రక్తపరీక్షను కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మనిషి రక్తంలోని పదార్థాలు కొత్త మెదడు కణాల ఉత్పత్తిని నియంత్రించగలవని వారి పరిశోధనలో తేలింది. కొన్నేళ్లుగా వయసు పెరగడం కారణంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్న 56 మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశోధకులు పరిశీలించారు. వీరిలో అల్జీమర్స్ వ్యాధి, కణాల మరణం పెరుగుతున్నదని తెలిసింది. దీని ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ కొత్త కణాలు సృష్టించే మెదడు సామర్థ్యంపైనా ప్రభావం చూపుతుందని గుర్తించారు. నాడీ కణాల ఉత్పత్తిలో మార్పులు గుర్తించారు.