లండన్, ఆగస్టు 8: రక్తంలో ప్రొటీన్ స్థాయిలు కనుక పెరిగితే మధుమేహం పెరిగే ఆస్కారం ఉందని, క్యాన్సర్ కారణంగా మరణం సంభవించే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు. సోడియం సమతుల్యత, రక్త పరిమాణం, రక్తపోటు వంటి అంశాలను క్రమబద్ధం చేసే ‘ప్రొస్టాసిన్’ అనే ప్రొటీన్ రక్తంలో అధికంగా ఉన్న వారిలో 76 శాతం మేర మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. మూత్రపిండాలు, రక్తంలో తక్కువ చక్కెరలు ఉన్న యువకుల్లో కూడా ముందస్తుగానే మధుమేహం వచ్చే సూచనలను గుర్తించొచ్చని పేర్కొంటున్నారు. ప్రొస్టాసిన్ స్థాయి ఉన్న వారు క్యాన్సర్ కారణంగా మరణించే అవకాశం 43 శాతం మేర ఉన్నట్టు తెలిపారు. చైనాలోని నాంజింగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు జరిపారు.