అంకారా : టర్కీ పార్లమెంట్ భవనం సమీపంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో (Huge Blast) ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. దుండగులు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వాహనంలో అంకారాలోని పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్దకు దూసుకొచ్చి బాంబు దాడికి పాల్పడ్డారని దేశీయాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
ఉగ్రవాదుల్లో ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడి జరిగిన ప్రాంతంలో టర్కీ పార్లమెంట్ సహా పలు మంత్రిత్వ శాఖల కార్యాలయాలున్నాయి.
అధ్యక్షుడు ఎర్దోగన్ ప్రసంగం నేపధ్యంలో టర్కీ పార్లమెంట్ నేడు తిరిగి ప్రారంభం కానున్న రోజే ఉగ్రవాదులు దాడికి తెగబడటం విశేషం. దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకోగా, అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Read More :