సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆసిఫ్ అలీ జర్దారీ, షెహబాజ్ షరీఫ్ సంయుక్తంగా ప్రకటించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటమే తమ సంకీర్ణ కూటమి ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 169మంది సభ్యుల మద్దతు అవసరం. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో స్వతంత్రులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారని, తమకు 180మంది సభ్యుల మద్దతుందని ఇమ్రాన్ఖాన్కు చెందిన పీటీఐ ప్రకటించింది.