అమెరికాలోని న్యూయార్క్లో కాల్పుల ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా జాతీయ ఐక్యతకు బైడెన్ పిలుపునిచ్చాడు. తన వ్యాఖ్యలను ఆధిపత్య చర్యగా న్యాయశాఖ పేర్కొందని బైడెన్ చెప్పారు. తుపాకీ సంస్కృతి కట్టడికి న్యూయార్క్ గవర్నర్, బఫేలో మేయర్ విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో 18 ఏండ్ల శ్వేత జాతి యువకుడు నల్లజాతీయులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరానికి పాల్పడుతున్న సమయంలో నిందితుడు లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. న్యూయార్క్లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.