Muhammad Yunus | బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనిస్కు స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలడంతో జైలు శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్ ఖుర్షీద్ ఆలం ఖాన్ తెలిపారు. ఆయనతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్ష ఖరారైంది. యూనిస్కు జైలు శిక్ష విధించడంపై ప్రతిపక్షాలు, మద్దతుదారులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసినట్లు ఘనత సాధించగా.. ప్రజలను దోపిడీ చేశారని ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు.
యూనస్ 2006లో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. బంగ్లాదేశ్లో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తున్న ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా.. ఇటీవల మహమ్మద్పై ఆరోపణలు చేస్తున్నారు. పేదల రక్తాన్ని పీలుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, మహమ్మద్ జైలు శిక్షపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది రాజకీయ కుట్రేనని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ సహా 160 మంది ప్రముఖులు యూనస్పై తీసుకున్న చర్యలను ఖండించారు.