వార్సా: కోవిడ్19 మహమ్మారి నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు 2022లో వస్తాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. పోలాండ్కు చెందిన గజెటా వైబోర్కాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సంస్థలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. కరోనా వైరస్ విజృంభణ ఓ ఊహించలేని విషాదం అని, అయితే గుడ్న్యూస్ ఏంటంటే.. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడమే అని గేట్స్ తెలిపారు. 2022 చివరినాటికి సాధారణ స్థితికి వస్తామని ఆయన అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్న కోవాక్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు గేట్స్ ఫౌండేషన్ సహకరిస్తున్నది. అత్యధిక నిధులు గేట్స్ సంస్థ నుంచి వెళ్తున్నాయి.