కీవ్: మరియపోల్ నగరాన్ని చేజిక్కించుకున్నట్లు ఇటీవల రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో ఉన్న అజోవ్ స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా ఉక్రెయిన్ సైనికులు ఆధీనంలో ఉంది. అయితే ఆ ప్లాంట్లో ప్రస్తుతం భీకర పోరు నడుస్తున్నట్లు అజోవ్ రెజిమెంట్కు చెందిన కమాండర్ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్లో రక్తపుటేరులు పారుతున్నాయని, రష్యా దళాలతో భీకరంగానే ఫైటింగ్ జరుగుతున్నట్లు చెప్పారు. అజోవ్ సేన కమాండర్ డెన్నిస్ ప్రొకపెంకో ఓ వీడియో మెసేజ్ను పోస్టు చేశారు. రష్యా దాడిని తమ సూపర్ సైనికులు ధైర్యంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అజోవస్తల్ స్టీల్ ప్లాంట్లో పరిస్థితి భయానకంగా ఉందని అన్నారు.
అజోవ్ స్టీల్ ప్లాంట్కు రష్యా బలగాలు ఎంటర్ అయినట్లు ఇటీవల ఓ ఉక్రెయిన్ అధికారి కూడా ప్రకటించారు. ఆ ప్లాంట్లో తలదాచుకుంటున్న సాధారణ పౌరులను తరలించనున్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తెలిపారు. అజోవ్ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే ప్రాధాన్యతగా ఉక్రెయిన్ రాజకీయ, సైనిక నేతలు ముందుకు వెళ్తున్నారు. ప్లాంట్ వద్ద రష్యా సైనికులు ప్రస్తుతం గ్రౌండ్ అటాక్కి దిగారు. గతంలో బాంబులు, మిస్సైళ్లతో దాడి చేసిన రష్యా ఇప్పుడు సైన్యాన్ని రంగంలోకి దింపింది.