ఆస్ట్రియా: పూర్తి స్థాయిలో కోవిడ్ టీకాలు తీసుకోని 20 లక్షల మంది ప్రజలకు ఆస్ట్రియా లాక్డౌన్ విధించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోవడం లేదని, కానీ దురదృష్టవశాత్తు ఇది అవసరమని ఛాన్సలర్ అలెగ్జాండర్ షల్లెన్బర్గ్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారికి కొత్త ఆంక్షలు వర్తించనున్నాయి. కొన్ని అవసరాల కోసమే వాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. పనిచేయడానికి లేదా ఆహార్ కొనేంఆదుకు బయటకు వెళ్లవచ్చు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆస్ట్రియాలో ఇప్పటి వరకు 65 శాతం జనాభా వ్యాక్సిన్ వేసుకున్నది. అయితే గత వారంలో అక్కడ వేగంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి.