నియామే: ఆఫ్రికా దేశం నైగర్లో సైనిక తిరుగుబాటకు జరిగిన ప్రయత్నం విఫలమైంది. అధ్యక్షుడికి చెందిన ఎలైట్ దళాలు.. ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాయి. ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్న సైనికులను సెక్యూర్టీ దళాలు నిలువరించాయి. దేశాధ్యక్షుడిగా మొహమ్మద్ బజోమ్ బాధ్యతలు స్వీకరించడానికి రెండు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. నైగర్ దేశ రాజధాని నియామేలో ఉన్న అధ్యక్ష భవనం వద్ద మంగళవారం అర్థరాత్రి కాల్పులు వినిపించాయి. ఆర్మీకి చెందిన కొందరు సభ్యులను అరెస్టు చేశారు. ఆ సైనికులకు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. అయితే ప్రెసిడెన్షియల్ గార్డ్కు చెందిన దళాలు ఆ సైనికుల్ని అడ్డుకున్నాయి. అధ్యక్ష భవనంలోకి ఎంటర్ కాకుండా చేశాయి. సుమారు 20 నిమిషాల పాటు భవనం వద్ద కాల్పులు జరిగాయి. 1960లో ఫ్రాన్స్ నుంచి నైగర్ స్వాతంత్య్రం పొందింది. బజోమ్ గతంలో హోంమంత్రిగా చేశారు. పదేళ్లు అధ్యక్షుడిగా చేసిన మొహమ్మద్ ఇసౌఫో స్వచ్చందంగా తప్పుకోవడంతో ఆ బాధ్యతలను బజోమ్ చేపట్టనున్నారు.