మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల
వాషింగ్టన్, మార్చి 13: అమెరికాలో ఆసియన్ అమెరికన్లపై కొనసాగుతున్న దాడులు, విద్వేష చర్యలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతోపాటు ఆ దేశానికి చెందిన పలువురు చట్టసభ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విద్వేషం, జాతివివక్ష, హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. గతేడాది మార్చి-డిసెంబర్ మధ్యలో ఆసియన్ అమెరికన్లపై 3వేలకుపైగా దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘జాతి వివక్ష, ద్వేషం, హింసకు మన సమాజంలో చోటులేదు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఆసియన్ అమెరికన్లకు అండగా ఉంటా’ అని సత్యనాదెళ్ల ట్వీట్చేశారు.