టొరటో: కెనడాలో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో శ్రీమాతా భామేశ్వరి దుర్గాదేవి సొసైటీ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గోడలపై భారత్కు వ్యతిరేకంగా విద్వేష రాతలు రాశారు. ‘పంజాబ్ భారత్లో భాగం కాదు’ అంటూ దేవాలయ గోడలపై నల్లటి స్ప్రే పెయింట్ ద్వారా రాశారు. సర్రేలో ఇలా హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇది రెండోసారి. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు.