టోక్యో: జపాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో టోక్యో సమీపంలో ఉన్న ఓ పట్టణంలో భారీగా మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 19 మంది అదృశ్యమైనట్లు అధికారులు చెప్పారు. షిజువాకా జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. మట్టిచరియలు విరిగిపడ్డ ప్రాంతం నుంచి చాలా మంది ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. చాలా శక్తివంతమైన నల్లటి మట్టిచరియలు వేగంగా దూసుకువచ్చినట్లు టీవీ ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. గత వారం నుంచి జపాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.