ఎన్’జమెనా : ఆఫ్రికా దేశం చాడ్లో గోల్డ్ మైనర్ల మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు వంద మంది మృతి
చెందారని ఆ దేశ రక్షణ మంత్రి దావూద్ యాయా బ్రాహిమ్ సోమవారం తెలిపారు. లిబియా సరిహద్దుకు
సమీపంలోని పర్వత ప్రాంతాలైన కౌరీ బౌగౌడి జిల్లాలో ఓ అనధికారిక బంగారు గనిలో ఈ నెల 24-25 మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. ఘర్షణను నివారించేందుకు ప్రభుత్వం ఆదివారం సంఘటనా స్థలానికి ఓ బృందాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఘర్షణలో దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయారని, పెద్ద ఎత్తున గాయపడ్డారని పేర్కొన్నారు. అనంతరం అనధికారిక మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశామని, ఘటనా స్థలి నుంచి కార్మికులను ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.