ఢాకా : ఐదు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నారావణే బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా నారావాణే శనివారం ఢాకాలో బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులతో సమావేశమయ్యారు. అంతకుక్రితం బంగ్లా దళాల కార్యచరణ ప్రదర్శనను ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు.
ఇరు దేశాల సైన్యాల మధ్య శాశ్వత స్నేహానికి గుర్తుగా కాక్స్ బజార్లోని రాము కంటోన్మెంట్లో ఓ చెట్టును నాటారు. నారావణే 10వ పదాతిదళ విభాగాన్ని సందర్శించారు. 2021.. ఈ ఏడాది భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబధాల 50వ వార్షికోత్సవం. బంగాబంధు ముజిబూర్ రెహ్మాన్ జన్మ శతాబ్ది.