మాస్కో: ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకునేందుకు ఏ దేశం ప్రయత్నించినా.. మెరుపువేగంతో స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. మమ్ముల్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీలేదని, అవసరమైతే అన్ని ఆయుధాలను ప్రయోగిస్తామన్నారు. బాలిస్టిక్ మిస్సైళ్లతో పాటు న్యూక్లియర్ ఆయుధాలకు చెందిన అంశాలపై పుతిన్ పరోక్షంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ మిత్ర దేశాలకు ఆ దేశానికి ఆయుధాల సరఫరాను పెంచేశాయి. రష్యాను ఉక్రెయిన్ ఓడించాలన్న ఉద్దేశంతో అమెరికా ఆయుధాలను తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ తాజా వార్నింగ్ ఇచ్చారు. సెయింట్ పీటర్స్బర్గ్లో ఆయన బుధవారం చట్టసభ ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తూర్పు ఉక్రెయిన్లో రష్యా చితికిలపడుతున్నట్లు పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి.