పెషావర్ : రాజస్థాన్ మహిళ అంజు (34)..పాక్ యువకుడ్ని వివాహమాడి అందరికీ షాకిచ్చింది. భర్త, ఇద్దరు పిల్లల్ని విడిచి పాక్లో అడుగుపెట్టిన అంజు, ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా(29)ను మంగళవారం వివాహమాడింది. ఖైబర్ పంక్తూంఖ్వా ప్రావిన్స్ ఉప్పర్ దిర్ జిల్లాలోని ఓ స్థానిక కోర్టులో ఇస్లాం మత పద్ధతుల్లో వారి వివాహం జరిగిందని స్థానిక పోలీసు ఉన్నాతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. దీనికంటే ముందు అంజు ఇస్లాం మతాన్ని స్వీకరించి..తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. 2019లో ఫేస్బుక్లో పరిచయమైన నస్రుల్లా కోసం భర్త, ఇద్దరు పిల్లల్ని విడిచి అంజు పాక్లో అడుగుపెట్టడం సోమవారం సంచలనం రేపింది. పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ భారత్కు వచ్చి ఓ హిందువుని వివాహం చేసుకున్న ఉదంతాన్ని గుర్తుచేసింది. హిందూ మతాన్ని స్వీకరించి ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ యువకుడ్ని సీమా హైదర్ పెండ్లి చేసుకున్నట్టుగానే, అంజూ ఇస్లాంలోకి మారి..పాక్ యువకుడ్ని వివాహమాడటం సంచలనంగా మారింది.