రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర పోరు నడుస్తున్న నేపథ్యంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్కు మద్దతుగా ఈ యుద్ధంలో తమ దళాలు పాలు పంచుకోవడానికి సిద్దంగా లేవని ఆయన తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తమ దళాలు పాల్గొనవని ప్రకటించారు. ఈ యుద్ధంలో తమ సేనలు పాల్గొనలేదని, రష్యాకు మద్దతుగా కూడా సేనలను పంపమని స్పష్టం చేశారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వీరిద్దరూ చాలా సేపు ఫోన్లో సంభాషించుకున్న విషయం కూడా తెలిసిందే.
రష్యా తదుపరి టార్గెట్ ఏంటి అన్న విషయంపై బెలారస్ అధ్యక్షుడు లుకషంకో బయటపెట్టారు. ఉక్రెయిన్ తర్వాత పుతిన్ విరుచుకుపడేది పక్కనే వున్న మోల్దోవాపై అని ఆయన అధికారులతో అన్నారు.రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో బెలారూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషంకో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఓ మ్యాపును చూపిస్తూ.. రష్యా.. ఉక్రెయిన్ను ఎలా స్వాధీనం చేసుకోవాలని చూస్తుందో వివరించారు. ఈ సమయంలోనే ఆయన పుతిన్ తదుపరి టార్గెట్ను కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.